అల్లు వారి వారసుడుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు..అడపతడప సినిమాలు చేస్తూ..తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా ప్రేమ కాదంట’ అనే సినిమాలో నటిస్తున్నారు. టైటిల్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హీరో ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసి మెప్పించాడు.
ఇదిలా వుంటే తాజాగా ఈ హీరో చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించి అభిమానులకు షాక్లో ముంచాడు. ‘ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? అది రానున్న రోజుల్లో నేనే చెప్తాను. అప్పటివరకు నేను ఒక కారణం కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అని ట్వీట్ చేశారు.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అన్నా లవ్ సెట్ అయిందా? పెళ్లి కుదిరిందా?’ అన్న ప్రశ్నలకు.. ‘నేను వృత్తిపరంగా స్పెషల్ డే అని మరీ మరీ చెప్పాను సామీ’ అని సరదాగా రిప్లై ఇచ్చాడు శిరీష్. ‘ఏంటన్నా? హాలీవుడ్కు వెళ్తున్నావా?’ అన్న ప్రశ్నలకు శిరీష్.. ‘అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది, అందరికి కథ నచ్చింది అన్న ఆనందం. ది బెస్ట్ స్క్రిప్ట్ అఫ్ మై కెరీర్, ఐ ఫీల్ అంటూ రాసుకొచ్చాడు.
11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason 🙂
— Allu Sirish (@AlluSirish) November 11, 2021
ఆ రివ్యూ చూసి ఏడుపొచ్చింది : సమంత