telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న బద్ధ శత్రువులు… పద్మశ్రీ ఎఫెక్ట్…!

Kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు గణతంత్ర దినోత్సవం రోజున భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కంగన, కరణ్ ఇండస్ట్రీలో బద్ధ శత్రువులు అన్న విషయం తెలిసిందే. కరణ్ బంధుప్రీతికి పెట్టింది పేరు అని ఆయన షోలోనే కంగన అవమానించడం సంచలనం రేపింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కంగన సోదరి రంగోలీ కూడా కరణ్ జోహార్‌పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరికీ పద్మశ్రీ రావడంతో పాత విషయాలన్నీ మర్చిపోయి ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఈ విషయంపై కంగనా స్పందిస్తూ ‘‘కరణ్‌కు నిర్మాతగా దారి చూపించింది అతని తండ్రి యశ్ జోహార్. ఆ తర్వాత కరణే ఇంతటి స్థాయికి చేరుకోగలిగాడు. ఆయనకు పద్మశ్రీ వరించినందుకు శుభాకాంక్షలు’ అని తెలిపారు.
ఇప్పుడు కరణ్ జోహార్ వంతు వచ్చింది. కంగన తనను పొగడగానే ఆయన కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘కంగన తాను నటించిన సినిమాలతో తన సత్తాను నిరూపించుకున్నారు. ఆమె పద్మశ్రీకి అర్హురాలే. ఓ ఆర్టిస్ట్‌గా ఆమె ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఆ గుణం నాకు చాలా నచ్చుతుంది. కంగనకు సరిపోయే కథ నా వద్ద ఉంటే కచ్చితంగా ఆమెకు ఫోన్ చేయడానికి ఏమాత్రం వెనుకాడను. నాకు, కంగనకు మధ్య శత్రుత్వం ఉంది చాలా మీడియా వర్గాలు రాశాయి. కానీ మేం ఏ ఈవెంట్‌లో కలుసుకున్నా కూడా చక్కగా పలకరించుకుంటాం. ఓ నిర్మాతగా కంగన టాలెంట్ అంటే నాకు గౌరవం. మా గురించి ఎవరు ఎన్ని రకాలుగా రాసినా కంగనతో కలిసి పనిచేయడానికి నేను ఏమాత్రం మొహమాటపడను’ అని తెలిపారు.

Related posts