telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో విషాదం… గుండె నొప్పితో నటుడు జాన్ కొట్టాలీ మృతి

john

టాలీవుడ్‌ నటుడు జాన్ కొట్టాలీ తీవ్ర గుండెనొప్పితో మంగళవారం నాడు ఆకస్మికంగా కన్నుమూశారు. మను, ఫలక్‌నుమా దాస్ తదితర చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన జాన్ కొట్టాలీ మరణించిన విషయాన్నీ ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘మిస్టర్ అమాయకుడు’, ‘కళాకారుడు’ వంటి లఘు చిత్రాల్లో మంచి నటుడిగా పేరు సంపాదించి సినిమాల్లో తన సత్తా చాటారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులతో జాన్ కొట్టాలీకి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్‌తో పాటు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా తదితరులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

Related posts