ఇండియాలోనూ మూన్వాకర్ మైఖేల్ జాక్సన్కు మ్యూజిక్ కన్సర్ట్తో నివాళి అర్పించనున్నారు. దీని కోసం ముంబై, బెంగుళూర్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐయామ్ కింగ్.. ద మైఖేల్ జాక్సన్ ఎక్స్పీరియన్స్ అన్న లైవ్ కన్సర్ట్ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దేశదేశాలు తిరుగుతున్న ఆ టీమ్ ఇప్పుడు ఇండియాలో ఎంటర్కానున్నది.
మార్చి నెలలో ఐయామ్ కింగ్ షోను నిర్వహించనున్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మొత్తం ఏడు షోలను ఏర్పాటు చేయనున్నారు. బుక్మైషో ద్వారా టికెట్లను అమ్ముతున్నారు. జాక్సన్ పాపులర్ హిట్స్నే మ్యూజిక్ షోలో ప్రదర్శించనున్నారు.