ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరోయిన్ అలియా భట్ చిక్కుల్లో పడింది. ముంబాయి కోర్టు నోటీసులు జారీ చేసింది. అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అలియా ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది.
తాజాగా ఆలియా నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అయితే ఈ మూవీలో తన తల్లిని అవమానిస్తూ కించపరిచే విధంగా పాత్రని డిజైన్ చేశారని గంగూబాయి కుమారుడు బాబూజీ షా స్థానిక కోర్టును ఆశ్రయించారు.
దీంతో ఈ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, నటి ఆలియా భట్, రచయిత హుస్సేన్ జైదీలకు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవలలో కొన్ని సన్నివేశాలు అవమానకరంగా ఉన్నాయని.. అవి చూసిన ప్రేక్షకులకి మా కుటుంబంపై ద్వేషపూరిత భావనలు పెరిగే అవకాశాలున్నాయని బాబూజీ షా ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది.సెప్టెంబర్ 7వ తేదీకి తదుపరి విచారణని వాయిదా వేయడం జరిగింది.
అయితే ఈ చిత్రం మొదట గత ఏడాది సెప్టెంబర్లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది అయితే అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. ఆతర్వాత కరోనా మహమ్మారి కారణంగా మరింత ఆలస్యం అయ్యింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు వివాదం రేగడంతో సినిమా విడుదల పై ఉత్కంఠ నెలకొంది.