telugu navyamedia
సినిమా వార్తలు

లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు..

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో క‌న్నుముశారు. యావత్ దేశం ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆమె అంత్యక్రియలకు ప్ర‌ధాని మంత్రి స‌హా ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సైతం తన మేనేజర్ పూజా దద్లానితో కలిసి లతా మంగేష్కర్ కి నివాళులు అర్పించడానికి వచ్చారు. లతా పార్థివదేహానికి షారుఖ్ ముస్లిం పద్దతితో ప్రార్థన చేయగా, పూజా మాత్రం హిందువుల పద్ధతిలో ఆమె ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించింది. అయితే ఒకేసారి రెండు మతాలకు సంబంధించిన పద్ధతుల్లో ఇద్దరూ కలిసి ప్రార్థించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

షారుఖ్ ఖాన్ పూల గుత్తితో వచ్చి, వాటిని శవపేటికపై ఉంచి, దువా అర్పించి, ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేసి, లతా మంగేష్కర్ పాదాలను తాకడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

మ‌రోవైపు షారుఖ్ ప్రవర్తనను తప్పుబడుతూ.. అతడిని ట్రోల్ చేస్తున్నారు. నివాళులు అర్పించే సమయంలో ఆయన తన మాస్క్ ను కిందకు దించి ఆమె పాదాల దగ్గర ఊదాడు. దీన్ని తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు షారుఖ్.. లతా మంగేష్కర్ పాదాల వద్ద ఉమ్మేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు.

షారుఖ్ ప్రవర్తనను తప్పుబడుతూ.. అతడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే షారుఖ్ ఉమ్మేయలేదని.. భౌతిక కాయం వద్ద ఊదడం అనేది ఒక ప్రార్ధనా విధానమని ట్రోలర్స్ పై మండిపడుతున్నారు ఆయన అభిమానులు.

Related posts