దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎమోషనల్తో పాటు పలు కామెడీ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది.
సినిమా అంచనాలను అందుకుంటూ ఘన విజయంగా నిలిచింది. దీంతో సమంత సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సమంత నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ మహిళా ప్రాధాన్యమున్న సినిమా ఈ స్థాయిలో విజయం సాధించలేదని, సమంత వల్లె ఇది సాధ్యమైందని ఓ వెబ్సైట్లో రివ్యూ వచ్చింది. ఈ రివ్యూకు సమంత స్పందిస్తూ.. “ఈ రివ్యూ నాకు ఏడుపు తెప్పించింది. ఇది నేను మరింత కష్టపడి పనిచేసేందుకు స్ఫూర్తి నిచ్చింద`ని రిప్లై ఇచ్చింది. అలాగే చాలా మంది ప్రేక్షకులు, అభిమానులు సమంతకు అభినందనలు తెలియజేశారు. అలాగే అన్ని వెబ్సైట్లు సమంత నటనను ప్రశంసించి, `ఓ బేబీ`ని హిట్గా పేర్కొన్నాయి. వీటన్నింటికీ సమంత స్పందిస్తూ.. `చాలు.. దీనికి మించి ఇంకేమి అడగను” అంటూ సమాధానమిచ్చింది.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా షూటింగ్స్ చేయడం చాలా కష్టం : సి. కళ్యాణ్