telugu navyamedia
సినిమా వార్తలు

ఆ రివ్యూ చూసి ఏడుపొచ్చింది : సమంత

Samantha

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎమోష‌న‌ల్‌తో పాటు ప‌లు కామెడీ సన్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది.

సినిమా అంచ‌నాల‌ను అందుకుంటూ ఘ‌న విజ‌యంగా నిలిచింది. దీంతో స‌మంత సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. స‌మంత న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియాలో మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన ఏ మ‌హిళా ప్రాధాన్య‌మున్న సినిమా ఈ స్థాయిలో విజ‌యం సాధించ‌లేదని, స‌మంత వ‌ల్లె ఇది సాధ్య‌మైంద‌ని ఓ వెబ్‌సైట్‌లో రివ్యూ వ‌చ్చింది. ఈ రివ్యూకు స‌మంత స్పందిస్తూ.. “ఈ రివ్యూ నాకు ఏడుపు తెప్పించింది. ఇది నేను మరింత కష్టపడి పనిచేసేందుకు స్ఫూర్తి నిచ్చింద‌`ని రిప్లై ఇచ్చింది. అలాగే చాలా మంది ప్రేక్ష‌కులు, అభిమానులు స‌మంత‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అలాగే అన్ని వెబ్‌సైట్లు సమంత న‌ట‌న‌ను ప్ర‌శంసించి, `ఓ బేబీ`ని హిట్‌గా పేర్కొన్నాయి. వీట‌న్నింటికీ స‌మంత స్పందిస్తూ.. `చాలు.. దీనికి మించి ఇంకేమి అడ‌గ‌ను” అంటూ స‌మాధాన‌మిచ్చింది.

Related posts