మైత్రీ మూవీస్ బ్యానర్లో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా కాగా… ఈ సినిమాను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్లోని మైత్రీ మూవీస్ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ను చిత్ర యూనిట్కు అందజేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నాని ‘గ్యాంగ్ లీడర్’కు కెమెరామెన్గా పనిచేసిన మిరోస్లావ్ కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.
Stylish Star @alluarjun & #Sukumar ‘s#AA20 Launched today with a Pooja ceremony.
Produced by @MythriOfficial in Association with Muttamsetty Media.@iamRashmika @aryasukku @ThisIsDSP #Miroslaw #AA20PoojaCeremony pic.twitter.com/7nZXRie7wy
— BARaju (@baraju_SuperHit) October 30, 2019
కాగా ప్రస్తుతం ‘అల… వైకుంఠపురములో…’ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న ‘అల… వైకుంఠపురములో…’ టీజర్ను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.
తాజ్ మహల్ ఒక సమాధి… ప్రపంచ వింతకాదు… రంగోలి రనౌత్ కామెంట్స్