telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీలో చేరిన .. టీడీపీ అనకాపల్లి నేత అడారీ ఆనంద్…

adari anand joined in ycp today

ఏపీలో టీడీపీ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన అడారీ ఆనంద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆయన భారీ ర్యాలీతో జగన్ వద్దకు బయలుదేరారు. జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

ఆనంద్ విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుమారుడిగా లోకానికి సుపరిచితమే. ప్రస్తుతం కృషి ట్రస్ట్ ఛైర్మన్‌ గా పని చేస్తున్నారు. కాగా, అడారి ఆనంద్ తో పాటు యలమంచిలి మాజీ మున్సిపల్ ఛైర్‌ పర్సన్ రమాకుమారి, 12 మంది డెయిరీ డైరెక్టర్లు సైతం వైసీపీలో చేరనున్నారు. దీంతో దాదాపు మూడు దశాబ్ధాలుగా టీడీపీ నేతల అధీనంలో ఉన్న విశాఖ డెయిరీ ఇప్పుడు వైసీపీ గ్రిప్‌లోకి వచ్చినట్లయింది.

Related posts