*ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
*పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత
*పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత
*పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
*ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరి స్థానం
*ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా
*ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరి స్థానంలో అనంతపురం జిల్లా
*వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించిన ప్రెస్మీట్లో ఏపీ టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు . ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు.
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఏపీ ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది..