కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన “కేజీఎఫ్” చిత్రం దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యువ హీరో యశ్ ప్రధాన పాత్రలో మూవీ రూపొందుతుంది. ఫస్ట్ పార్ట్లో అధీరా అనే పాత్రని సస్పెన్స్లో పెట్టిన మేకర్స్ ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ని జూలై 29 విడుదల చేశారు. అధీరా పాత్రలో దత్తు భాయ్ అదరగొట్టారు. కాగా… టాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరొందిన రావు రమేష్ బంపరాఫర్ కొట్టేశారు. క్రేజీ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న కేజీఎఫ్ 2లో రావు రమేష్ నటించబోతున్నారు. ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తుండగా ఈ రోజు ఆ మూవీ షూటింగ్లో అడుగెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ‘‘రావు రమేష్ గారికి స్వాగతం. ఇందులో మీ పాత్ర గురించి ఊహాగానాలు ప్రేక్షకులకే వదిలేస్తున్నా. మిమ్మల్ని తెరపై చూసిన తరువాత వారికి తెలుస్తుంది. కేజీఎఫ్ 2లో మీరు భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.
previous post