telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘టీచర్స్ డే’ సందర్భంగా మహేష్ స్పెషల్ ట్వీట్

Mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “టీచర్స్ డే” సందర్భంగా ఒక స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేశారు. “అభ్యాసానికి హద్దులు లేవు. కరోనా మహమ్మారి సమయంలో కూడా విద్యార్థుల ప్రగతి కోసం అనేక మంది గురువులు తమ వంతు కృషి చేశారు. ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేరణ పొందడానికి, నేర్చుకోవడానికి నాకు సహాయం చేసిన నా మార్గదర్శకులకి ఎల్లప్పుడూ నా కృతజ్ఞతలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు” అని తెలిపారు మహేష్. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే… ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Related posts