టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని, గత కొన్నిరోజులుగా విడివిడిగా ఉంటున్నారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ రూమర్స్పై హేమచంద్ర దంపతులు ఇన్స్టా వేదికగా స్పందించారు.
గడిచిన కొన్ని రోజుల నుంచి నా యూట్యూబ్లో ఛానల్ వ్యూస్ పెరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయర్లు పెరుగుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు నాకు ఎక్కువ పని (సాంగ్స్, షోస్, డబ్బింగ్) దొరుకుతోంది. సాధారణంగా నేను సంపాదించే దాని కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. తప్పో ప్పో ఒప్పో కానీ మీడియా నాకో వరం” అని శ్రావణ భార్గవి భార్గవి పేర్కొన్నారు.
నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే కూడా అనవసరమైన చెత్త సమాచారం చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతుంది అంటూ హేమచంద్ర సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. సోషల్ మీడియా పోస్టుల్లో ఒకరిని ఒకరు ట్యాగ్ చేశారు.
కాగా మొదటి నుంచి స్నేహితులైన శ్రావణ భార్గవి, హేమచంద్ర పెద్దల అంగీకారంతో 2013లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది.
షబానా కామెంట్స్ పై కంగనా సోదరి కౌంటర్