మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటించారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషించారు. అనుకున్నట్లుగానే ఈ మూవీ దద్దరిల్లిపోయింది. అయితే.. ఈ సినిమాను రియల్ హీరో సోనూసూద్ హిందీలోకి రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తాజాగా టాక్ నడుస్తోంది. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో బాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని సోనూసూద్ అనుకుంటున్నాడట. రీమేక్ హక్కుల కోసం క్రాక్ నిర్మాత ఠాగూర్ మధుతో సోనూ సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను సోనూ స్వయంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే…
previous post