telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పనాజీ : … 3కోట్ల కోసం .. మంత్రినే బెదిరించిన ప్రభుద్దులు ..

ARREST crime

సాక్షాత్తూ రాష్ట్ర మంత్రిని తమకు రూ.3కోట్లు ఇవ్వాలని లేదంటే అప్రతిష్టపాలు చేయడంతో పాటు హతమారుస్తామని ముగ్గురు యువకులు ఫోన్‌లో బెదిరించిన ఘటన గోవాలో సంచలనం రేపింది. గోవా రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి దీపక్ పౌష్కర్ కు ముంబై నగరానికి చెందిన ముగ్గురు గుర్తుతెలియని యువకులు ఫోన్ చేశారు. తమకు రూ.3 కోట్లు ఇవ్వాలని, లేదంటే అతన్ని అప్రతిష్ట పాలు చేయడంతోపాటు హత్య చేస్తామని బెదిరించారు.

ఆగంతకులు పలుసార్లు మంత్రికి ఫోన్ చేసి బెదిరిస్తుండటంతో దీపక్ గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పథకం ప్రకారం డబ్బులిస్తామని ముగ్గురు యువకుల్ని మంత్రి ద్వార చెప్పించి వారిని రప్పించి అరెస్టు చేశారు. ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Related posts