రెండవ సమ్మరీ రివిజన్ లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులుగా బుద్ధ ప్రకాష్ సనత్ నగర్, సికింద్రాబాద్ ఖైరతాబాద్, ముషీరాబాద్, మలక్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా పరిశీలించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) రోల్ అబ్జర్వర్ గా నియమించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన జిహెచ్ఎంసి పరిధిలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటరు జాబితా ను పరిశీలించారు.
ఈ సందర్భంగా బుద్ధ ప్రకాష్ మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గా అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితా తయారు కోసం జిహెచ్ఎంసి పరిధిలో ఓటరు జాబితా పరిశీలన చేసినట్లు ఆయన తెలిపారు. రోల్ అబ్జర్వర్ వెంట రిటర్నింగ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
——————————————————
– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ