తెలంగాణ శాసనమండలి మాజీ చైర్ పర్సన్ , బీజేపీ నేత స్వామి గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని బండ్లగూడ చౌరస్తాలో శనివారం నాడు రాత్రి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది.దీంతో గాయపడ్డ స్వామిగౌడ్ను ఆస్పత్రికి తరలించారు. ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయ్యిందని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
బండ్లగూడ నుండి కిస్మత్ పూర్ లోని తన నివాసానికి బైక్ పై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకే రోడ్లపై గుంతలు ఏర్పడటం వల్లే తనకు ప్రమాదం జరిగిందని స్వామిగౌడ్ చెబుతున్నారు.
తెలంగాణలో కల్వకుంట్ల పోలీస్ సర్వీస్: ఎంపీ ఉత్తమ్