గతరెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పై భారీగా వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నారు. హయత్నగర్ డివిజన్లోని సుష్మా సాయినగర్ ‘గ్రీన్ మిడోన్ కాలనీ’లోకి వెళ్లే దారి కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది.
దీంతో వారు ఇళ్లకు వెళ్లే దారిలేక కాలనీ వాసులు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వర్షపు నీటిలో పడుకుని నిరసన తెలిపారు. , తిరుమల్ రెడ్డి గతంలోనూ ఇలానే వినూత్నంగా నిరసన తెలిపి వార్తల్లోకి ఎక్కారు.