హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో దంపతులు ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ కాలనీల విషాదంచోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వైజాగ్కు చెందిన రమేశ్ నాయుడు, అనిత దంపతులు ప్రశాంత్ నగర్లో నివసిస్తున్నారు. కల్యాణిపురి కాలనీకి చెందిన అనితతో రమేశ్ ప్రేమ వివాహం ఆరు నెలల క్రితం జరిగింది.
ఇదిలా ఉంటే రమేశ్ నాయుడికి గతంలోనే వివాహం జరిగిందని సమాచారం. రమేశ్, అనిత దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే రమేశ్ ఇంటికి చేరుకోకముందే అనిత ఉరివేసుకొని ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘటనతో షాకైన రమేశ్ తను కూడా ఉరివేసుకొని ఉండొచ్చని అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.