రేపటి నుంచి ప్రారంభమయ్యే అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఎంసెట్-2019)కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆన్లైన్లో శనివారం నుంచి 23 వరకు (7 సెషన్లు) ఇంజనీరింగ్ విభాగం, 23-24 తేదీల్లో (3 సెషన్లు) అగ్రికల్చర్, మెడికల్ విభాగపు పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సా.2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఒక్కో సెషన్లో 30వేల మందికి అవకాశం కల్పించారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ఆబ్జెక్టివ్ టైపులో ఉంటాయి. ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్కు హాజరుకానున్నారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్, మెడికల్లో 86,910 మంది ఉన్నారు. ఏపీ ఎంసెట్కు ఏపీలో 109 సెంటర్లు, హైదరాబాద్లో 6 మొత్తం 115 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ సాయిబాబు తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు:
పరీక్షా కేంద్రానికి గంట ముందు హాజరుకావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
పరీక్ష హాల్లోకి విద్యార్థి ఎంసెట్ హాల్టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పెన్నులు, అటెస్టేషన్తో కూడిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే) మాత్రమే అనుమతించబడతాయి.
స్మార్ట్, మొబైల్ ఫోన్లు, వాచీలు, చిప్ ఎలకా్ట్రనిక్ పరికరాలను అనుమతించరు.
పరీక్షకు ముందు బయోమెట్రిక్ విధానంలో ఆయా విద్యార్థుల వేలిముద్రలు స్వీకరిస్తారు. పరీక్ష మొదలైన వెంటనే విద్యార్థికి మిగిలి ఉన్న సమయాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్ సూచిస్తుంది.
ఎంసెట్కు సంబంధించిన సందేహాల నివృత్తికి 0884 2340535, 2356255 నంబర్లకు లేదా [email protected] మెయిల్ ద్వారా సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.
AP eamcet arrangements completed