హైదరాబాద్ లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలికపై రేప్ ఘటన మరవక ముందే నగరంలో మరో దారుణం జరిగింది.
తాజాగా సికింద్రాబాద్ లోని కార్ఖానా పరిధిలో మైనర్పై రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఐదుగురిలో ఓ బాలుడు ఉండగా మిగతా నలుగురిపై పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు. మైనర్ ను జువైనల్ హోంకు తరలించారు.
వివరాల్లోకి వెళితే..
బాధిత బాలిక ధీరజ్, రితేశ్ అనే యువకులకు ఇన్ స్టాగ్రాంలో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి ధీరజ్, రితేశ్ బాలికను భయపెట్టారు.
బాధితరాలు వీడియోలు ఇవ్వాలని కోరగా .. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి ఇతర స్నేహితులతో కలిసి మరోసారి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబసభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లారు. మానసిక నిపుణుడి వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మే30న పోలీసులకు ఫిర్యాదు చేశారు.