ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ కస్టడీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించడం గమనార్హం.
ఈ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరంను సీబీఐ ఆగస్ట్ 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపైనా సీబీఐ చార్జిషీట్ నమోదైంది. ప్రస్తుతం బెయిల్ మంజూరు అయినా, ఈడీ కస్టడీలో ఉన్నందున 24వ తేదీ వరకూ ఆయన విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.
గుళ్లు,గోపురాలకు తిరగడానికే గవర్నర్: వీహెచ్