మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని మావోయిస్టులు కాల్చిచంపారు. సోమవారం అర్ధరాత్రి భమ్రాగఢ్ చేరుకున్న మావోలు ఈ ముగ్గురి ఇళ్లలోకి వెళ్లి వీరిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. తమ వివరాలను పోలీసులకు రహస్యంగా చేరవేస్తున్నారంటూ ముగ్గురిని తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించినందుకే ఈ శిక్ష విధించినట్లు బ్యానర్లు కట్టారు.
అనంతరం విచారణ జరిపి పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేసినట్లు అభియోగాలు మోపారు. వీరి కారణంగానే గతేడాది ఏప్రిల్ లో కసంసూర్ ఎన్ కౌంటర్ లో 40 మంది మావోయిస్టులు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మావోల కోసం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.