నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మార్సీకీ ఓ ఉపాధ్యాయురాలు కిరోసిన్ బాటిల్ తో వచ్చి కలకలం రేపింది. ఎంఈవో కార్యాలయం ఎదుట తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.
దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో తాను ఉపాధ్యాయురాలు పని చేస్తున్నానని, తనపేరు రాంభాయి అని ఆమె తెలిపింది. తాను పని చేస్తోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.