బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.హిందువులు దర్గాలకు వెళ్లొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు.
హిందు రాజును అవమానించిన చోటుకు హిందువులు ఎందుకు వెళతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో మత విశ్వసాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కంచన్బాగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
రాజాసింగ్ కామెంట్స్ చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని ..ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మత పెద్దలు .ఈ క్రమంలో ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద కేసు ఫైల్ చేసినట్టు వెల్లడించారు.
ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!