గాన గాంధర్వుడు ఎస్పీ బాలు శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో యావత్ సంగీత ప్రపంచ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సమయంలో అసలు ఎస్పీ బాలుకి కరోనా ఎలా సోకింది. జులై 30 న హైదరాబాద్లో “సామజవరగమనా” అనే టీవీ షోలో పాల్గొనడం ద్వారానే ఆయనకు కరోనా సోకిందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ షోలో పాల్గొన్న చాలా మంది సింగర్లకు కరోనా సోకింది. అయితే సింగర్ మాళవిక ద్వారానే ఎస్పీ బాలుకి కరోనా సోకిందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. వాటిని ఖండిస్తూ మాళవిక సైబర్ క్రైమ్ని ఆశ్రయించి.. తనపై సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరారు. అయితే బాలు మరణంతో మళ్లీ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ “నా గురించి ఒక ఫేక్ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. వాటిపై నేను క్లారిటీ ఇవ్వదల్చుకున్నాను. ఎస్పీబీ స్పెషల్ ఎపిసోడ్స్.. జూలై 30, 31న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది. జూలై 30 చాలా మంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు. నేను పార్టిసిపేట్ చేసింది జూలై 31న. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ఈవెంట్లో నేను పాల్గొన్నాను. నాకు బాగా గుర్తింది.. ఆగష్టు 1న బాలుగారు మెసేజ్ చేశారు.. నేను చాలా అలిసిపోయాను. వరుసగా షూటింగ్ ఉండటం వల్ల టైడ్ అయ్యానని మెసేజ్ పెట్టారు. ఆగష్టు 5న ఆయన కరోనా అని వీడియో ద్వారా తెలిపారు. అదే టైంలో కొంతమంది మ్యుజిషియన్స్కి కరోనా సోకిందని తెలిసింది. ఆ షూట్లో నేను పాల్గొన్నాను కాబట్టి.. నేనూ టెస్ట్ చేయించుకున్నా. నాతో పాటు చాలా మంది కరోనా టెస్ట్ చేయించుకున్నారు.
అయితే నాకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ ఆగష్టు 8 వచ్చింది. షూటింగ్ జరిగింది జూలై 31న. అంతకు ముందు నాకు కరోనా వచ్చే అవకాశం లేదు. షూటింగ్ వెళ్లడానికి ముందు గత ఐదు నెలలుగా మేం ఇంట్లోనే ఉంటున్నాం. మా ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లకు కరోనా రాకూడదని బయటకు వెళ్లడం లేదు. మా ఆయన 5 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. నాకు 5 నెలల పాప ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ 5 నెలల తరువాత నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్లాను. దయచేసి అర్థం చేసుకోండి.. ఆగష్టు 5 తరువాత మాకు అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకున్నాం తప్పితే అంతకు ముందు నేను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాను. అయితే నాకు కరోనా వచ్చిన తరువాత మా ఇంట్లో మా అమ్మ, నాన్న, పాపలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ల రిపోర్ట్ ఆగష్టు 9న వచ్చింది. మా నాన్న ఇప్పుడు హాస్పటల్లో ఉన్నారు. మేం కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం.. బాధలో ఉన్నాం.. దయచేసి నాపై దుష్ప్రచారం చేయవద్దు. బాలుగారి ఫ్యామిలీ కూడా బాధలో ఉంది. ఇలాంటి సందర్భంలో అందరి బ్లెస్సింగ్ కావాలి. నాపై తప్పుడు మెసేజ్ని ప్రచారం చేసిన వాళ్ల వివరాలను సేకరించి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తున్నా. బాధలో ఉన్న సమయంలో నన్ను నా కుటుంబంతో దుష్ప్రచారం చేయడం దారుణం. ఈ ఫేక్ మెసేజ్ని సర్క్యూలేట్ చేయొద్దు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
జగన్ కు అనుభవం లేదు… మార్పు మంచిదే… హీరో కామెంట్స్