telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొత్త వాహన చట్టం : .. మొదటిగా బలైంది .. నేనే బాబులు .. అంటున్న గడ్కారీ ..

ఈ నెల 1 నుంచి కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది అనేక విమర్శలకు గురవుతుంది. అయినా తప్పదంటుంది కేంద్రప్రభుత్వం. ఎవరికి వారు నిబంధనలు పాటించే వరకు మార్పులు ఉండవని ఖచ్చితంగా చెప్పేసింది ప్రభుత్వం. ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాను తప్పనిసరిగా కట్టాలి. లేదంటే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కేంద్రం హెచ్చరించింది. ఇటీవలే ముంబైలో గడ్కారీ ప్రయాణిస్తున్న కారు పరిమితికి మించిన వేగంతో ప్రయాణం చేసింది. దీంతో అక్కడి పోలీస్ అధికారులు నితిన్ గడ్కారీ కారుకు ఫైన్ వేశారు. ఆ ఫైన్ కూడా భారీ మొత్తంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గడ్కారీ స్వయంగా మీడియాతో పేర్కొన్నారు. ఒకేసారి చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఆ చట్టం కింద ప్రతి ఒక్కరు పని చేయాలని అన్నారు. ఎవరూ మినహాయింపుకాదని చెప్పారు.

తప్పు ఎవరు చేసినా తప్పే.. తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఫైన్ కట్టాల్సిందే. అందుకే తాను కూడా ఫైన్ కట్టానని చెప్పారు. ఫైన్ విషయంలో తమ రూలు మారదని చెప్పారు. కొన్నిరోజులపాటు వీటిని పాటించడం కష్టంగానే ఉండొచ్చు. కానీ, తరువాత ఆ కష్టం ఉండదని, మన దగ్గర నిబంధనలకు సంబంధించిన అన్ని కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదనీ అన్నారు. ఒకసారి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెడితే.. మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. తలెత్తుకొని బయట తిరగడగలుగుతాం. ఒక్క వాహన చట్టం మాత్రమే కాదు.. దేశం ప్రవేశపెట్టిన చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. చట్టాలను అతిక్రమించకుండా ఫాలో కావాలి. అప్పుడే దేశం పురోగమిస్తుంది. ప్రపంచ దేశాలతో సమానంగా ఎదుగుతుంది. అలసత్వం ప్రదర్శిస్తే.. దేశం అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది.

Related posts