telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

శ్రీలంక : .. పాక్ లో .. క్రికెట్ ఆడేదిలేదు ..

srilanka cricket board cancelled pakistan tour

శ్రీలంక క్రికెట్ బోర్డు .. పాక్ టూర్‌ని రద్దు చేసుకుంది . ఈ నెలలో లంక టీం వన్డే, టీ20 సిరీస్ కోసం పాక్ లో పర్యటించాల్సి ఉంది. సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగాళ్లు పాక్​లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ జాబితాలో లంక జట్టు మాజీ సారథులు ఆంజెలో మ్యాథ్యూస్, తిసారా పెరీరా ఉన్నారు.

సెప్టెంబర్ 27 నుంచి పాక్ ​లో ఆరు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది శ్రీలంక. అక్టోబర్​ 9 వరకు కొనసాగే ఈ పర్యటనలో ఇందులో మూడు వన్డేలు, మూడు టీ 20లు ఉన్నాయి. 2009లో శ్రీలంక క్రికెటర్ల వాహనాలపై ఉగ్రదాడి అనంతరం పాక్​లో అంతర్జాతీయ మ్యాచ్​ ఆడలేదు ఆ దేశం. అప్పటి నుంచి యూఏఈ కేంద్రంగా పాక్ ఇతర దేశాలతో మ్యాచ్​లు ఆడుతుంది.

Related posts