పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రవాదుల సహచరులైన 8మంది కీలక సూత్రధారులను అరెస్టు చేశారు. లష్కరేతోయిబాకు చెందిన ఇజాజ్ మీర్, ఒమర్ మీర్, తౌసీఫ్ నజార్, ఇంతియాజ్ నజార్, ఒమర్ అక్బర్, ఫైజాన్ లతీఫ్, దానిష్ హబీబ్, షౌకత్ అహ్మద్ మీర్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు అత్యంత కీలక సహచరులైన వీరు పలు దాడులకు వ్యూహం రూపొందించారని సమాచారం.
ఉగ్రవాదుల తరపున వీరు పోస్టర్లు తయారు చేసి వాటిని గోడలపై అతికిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్థానిక పౌరులపై దాడులు చేయించి వారిని హతమార్చిన కేసులో వీరు నిందితులని పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్లు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.