2024 నాటికి ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలపై మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ అరాచకాలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు.
గ్రామ వాలంటీర్ల పేరుతో మరో జన్మభూమి కమిటీకి తెరలేపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోందని అన్నారు. ఏపీలో 25 లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ లో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు..రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు