telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణాలో .. ప్రశాంతంగా .. పోలింగ్ : రజత్ కుమార్

Rajat Kumar Lok Sabha Elections

రాష్ట్ర ఈసీఓ రజత్ కుమార్ తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, ఎక్కడా ఏ విధమైన సమస్యలూ లేవని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పోలింగ్ సరళిపై మీడియాతో మాట్లాడిన ఆయన, మాక్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఆపై పోలింగ్ ప్రారంభంకాగా, ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు.

నిజామాబాద్ లోక్‌ సభ కు కూడా మాక్ పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించామని, ఎక్కడా ఫిర్యాదులు రాలేదని అన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఎక్కడైనా ఈవీఎంలలో సమస్యలు ఎర్పడినట్టు ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని రజత్ కుమార్ వ్యాఖ్యానించారు.

Related posts