అందం, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ భామ శిల్పా శెట్టి. ప్రముఖ వ్యాపార వేత్త రాజ్కుంద్రాని వివాహం చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకి దూరంగా ఉంది. నవంబర్ 22,2009న రాజ్ కుంద్రా,శిల్పాశెట్టిల వివాహం జరగగా, వీరికి ఎనిమిదేళ్ళ కొడుకు వియాన్, మూడు నెలల కూతురు సమిషా ఉన్నారు. సమిషా సరోగసీ ద్వారా జన్మించిన విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ళ తర్వాత నికమ్మ, హంగామా 2 చిత్రాలతో తిరిగి ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమైంది. శిల్పా శెట్టి నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన భర్త రాజ్కుంద్రా ఓ వీడియో ద్వారా రొమాంటిక్ బర్త్డే విషెస్ అందించాడు. వైవాహిక జీవితంకి సంబంధించిన మధుర స్మృతులని ఓ వీడియోగా రూపొందించి తన శ్రీమతికి లవ్లీ విషెస్ అందించాడు. ఒక్కో ఫోటోకి ప్రత్యేకమైన కొటేషన్స్ రాసి తన ప్రేమని తెలియజేశాడు. నీ ప్రేమతో, నా లోపాలను పరిపూర్ణతలుగా మార్చిన మహిళ మీరు. మీరు చిరునవ్వు నా జీవితంలో చీకటి రోజులను వెలిగిస్తుంది . మీరు నా పిల్లల తల్లి మాత్రమే కాదు, నా జీవితానికి, హృదయానికి రాణి. ఐ లవ్ యు జాన్ . పుట్టినరోజు శుభాకాంక్షలు శిల్పాశెట్టి అని రాసుకొచ్చారు రాజ్. తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో నటించిన శిల్పా శెట్టి సాహసవీరుడు సాగరకన్య, ఆజాద్, భలేవాడివి బాసు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.
previous post