మలేసియాలో పెళ్లి భోజనాలకు వచ్చిన ఓ అతిథి జంట చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. నెటిజన్లు ఆ దంపతులపై విరుచుకుపడుతున్నారు. సభ్యత, సంస్కారంలేని.. ఇంకా చెప్పాలంటే అసలు మర్యాద అంటే ఏంటో తెలియని వ్యక్తులు మాత్రమే ఇలా ప్రవర్తిస్తారని జంటపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకు ఆ దంపతులు చేసిన గలీజ్ పనేంటో తెలుసా? భోజనం చేసిన తరువాత వారి పిల్లోడికి వాడిన డైపర్ను తీసి ప్లేట్లో పెట్టేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదే పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి తన మొబైల్లో ఫొటో తీసి ట్విట్టర్ పెట్టాడు. ఫొటోకు ‘వివాహానికి హాజరైన తెలివి తక్కువ అతిథి’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్కు ఇప్పటి వరకు 7వేలకు పైగా రిట్వీట్స్, 2వేల లైక్స్ వచ్చాయి. ఫొటోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
సిద్ధార్థ్ నన్ను వాడుకున్నాడు… కానీ… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు