ఎన్నికల పరిశీలనకై కొత్తగా నియమించిన కేకే.శర్మ పై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీనితో నేడు ఆయనపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది. శర్మ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఎన్నో పిర్యాదులు చేసినా పట్టించుకోకపోవటం వలన ఢిల్లీ వరకు వెళ్లాల్సి వచ్చిందని టీడీపీ నేత కనకమేడల అన్నారు.
పీఎంఓ కనుసన్నలలో ఈసీ కూడా పనిచేస్తుందని కనకమేడల విమర్శించారు. ప్రాధమికంగా కేకేని కూడా బీజేపీ నే నియమించిందని ఆయన అన్నారు. కేంద్రం తరుపున వారి మద్దతు దారు వైసీపీకి మేలుచేసేందుకే హడావుడిగా ఈ నియామకం జరిగిందని ఆయన అన్నారు. టీడీపీ ఖచ్చితంగా వీటిని చూస్తూ ఊరుకోదని, అందుకే ఢిల్లీ వరకు వచ్చి పిర్యాదు చేశామని ఆయన స్పష్టం చేశారు.