పాకిస్తాన్కు చెందిన మహిళను ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు పాకిస్థాన్లోని కరాచీకి చెందిన నౌషీన్ నాజ్ గా గుర్తించారు. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని అజ్మేరీ గేట్ ఇంటిలో దీర్ఘకాలిక వీసాపై ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. మహిళ తన దీర్ఘకాలిక వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ నోయిడాలోకి ప్రవేశించింది.
ఆమె ప్రయాణిస్తున్న బస్సును నగరంలోని సెక్టార్ 14 ఎ వద్ద గల ఫ్లైఓవర్ కింద అధికారులు తనిఖీ కోసం ఆపారు. తనిఖీ తర్వాత సదరు మహిళను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విదేశీయుల చట్టం, 1946 లోని సెక్షన్ 14 కింద సెక్టార్ 20 పోలీస్ స్టేషన్లో మహిళపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.