లాక్డౌన్ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తాజాగా తెలంగాణ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుతాయని ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మిన ప్రజలు, రెండు నెలలు ఇళ్లకే పరిమితం అయ్యారని, వారికి ఉపశమనం ఎప్పుడో అంతుబట్టడం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు. “టిఆర్ఎస్ సర్కారు సూచనలతో దాదాపు 2 నెలలుగా ఇళ్లకే పరిమితమైన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం ఎప్పుడో అంతుబట్టడం లేదు. మే 8వ తేదీ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుతాయన్న ప్రభుత్వ ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెంచుకున్నారు. కానీ…మొదటి నుంచీ అయోమయ ప్రకటనలతో, అస్పష్ట నిర్ణయాలతో… కరోనా కట్టడి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఈ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది” అని ట్వీట్ చేశారు.
తబ్లిక్జమాత్కు వెళ్ళినవారందరినీ సర్కారు గుర్తించిందా? వారందరికీ క్వారంటైన్ పూర్తయిందని టిఆర్ఎస్ సర్కారు స్పష్టత ఇవ్వగలదా? ప్రస్తుతం వలసకూలీల వల్ల కరోనా వ్యాపిస్తోందని ప్రభుత్వం కొత్తవాదనను తెరపైకి తెచ్చింది. అదే నిజమైతే హైదరాబాద్ను రెడ్జోన్గా ప్రకటించడంలో అర్థమేముంది? అంటే..
— VijayashanthiOfficial (@vijayashanthi_m) May 14, 2020