సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్ లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న మహేశ్ బాబు కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఓ హై ఓల్టేజ్ ఫైట్ రామ్, లక్ష్మణ్ స్టంట్ కొరియోగ్రఫీలో పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లొకేషన్ వర్కింగ్ స్టిల్ను విడుదల చేసింది చిత్రబృందం.
కాగా..ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ టీమ్ టీచర్ వదిలారు. బ్లాస్టర్ వీడియోలో ఫైట్, డైలాగ్స్, అదిరిపోయే హ్యాండ్సమ్ లుక్స్ తో మహేశ్ ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పడింది. ఈ జంటను తెరపై చూడడానికి ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ వీడియో బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇటీవల హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా టీమ్ గోవాలో ల్యాండ్ అయ్యారు. 2022 సంక్రాంతి రేసు లో ఉండడంతో వేగం పెంచేశారు దర్శకనిర్మాతలు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపైన దృష్టి పెట్టనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’కు పాటల్ని థమన్ సమకూరుస్తున్నాడు.
దిశ ఘటనపై పవన్ వ్యాఖ్యలు వక్రీకరణ… కుహనా మేధావులు అంటూ నాగబాబు సమాధానం