telugu navyamedia
సినిమా వార్తలు

గోవాలో మ‌హేష్ ..!

 

సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్ లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న మహేశ్ బాబు కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఓ హై ఓల్టేజ్ ఫైట్ రామ్, లక్ష్మణ్ స్టంట్ కొరియోగ్రఫీలో పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లొకేషన్‌ వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

Image

కాగా..ఇటీవ‌ల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ టీమ్ టీచ‌ర్ వ‌దిలారు. బ్లాస్టర్ వీడియోలో ఫైట్, డైలాగ్స్, అదిరిపోయే హ్యాండ్సమ్ లుక్స్ తో మహేశ్ ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పడింది. ఈ జంటను తెరపై చూడడానికి ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ వీడియో బ్లాక్ బస్టర్ అయ్యింది.

Mahesh Babu and Keerthy Suresh look perfect in new Sarkaru Vaari Paata still. Seen yet? - Movies Newsఇటీవల హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా టీమ్‌ గోవాలో ల్యాండ్ అయ్యారు. 2022 సంక్రాంతి రేసు లో ఉండ‌డంతో వేగం పెంచేశారు దర్శకనిర్మాతలు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపైన దృష్టి పెట్టనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’కు పాటల్ని థమన్ సమకూరుస్తున్నాడు.

 

 

Related posts