telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పారితోషికం విషయంలో తగ్గనంటున్న తమన్నా ?

Tamannah

లాక్‌డౌన్ ప్రభావంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉంటూనే తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా రోజూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. దాదాపు పదిహేనేళ్లపాటు వెండితెరపై అగ్రకథానాయికగా కొనసాగింది. దక్షిణాదిన తమిళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన ఈ బ్యూటీ పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటించింది. ఇటీవల కాలంలో తమన్నాకి కొంతవరకూ అవకాశాలు తగ్గాయి. తెలుగు, తమిళ, హిందీలో కలుపుకుని ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య చాలా తక్కువ. అయినా పారితోషికం విషయంలో మాత్రం ఆమె ఎంతమాత్రం తగ్గడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రవితేజ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. అయితే ఆమె 3 కోట్లు డిమాండ్ చేసిందట. రెండున్నర కోట్ల వరకూ ఇస్తామని చెప్పినా ఆమె మెట్టుదిగి రావడం లేదని చెప్పుకుంటున్నారు. రవితేజకి తమన్నాకి మధ్య మంచి స్నేహం వుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘బెంగాల్ టైగర్’ అనే హిట్ మూవీ చేశారు కూడా. రవితేజ సినిమా అనగానే తమన్నా ఒప్పుకుంటుందని భావించిన నిర్మాతలు, ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో ఆలోచనలో పడ్డారని సమాచారం.

Related posts