ఏపీ రాజధానిని తరలించకుండా న్యాయ పోరాటాలు చేస్తున్నామని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాజధాని ప్రజలకు అండగా తాను ఉంటానని, బీజేపీ మద్దతు ఉందని తెలిపారు. రాజీలేని పోరాటం చేస్తున్న రాజధాని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారుఅమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని సుజనాచౌదరి పేర్కొన్నారు.
విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసుల తరలింపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతించారు. రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. రాజధానికి, విజిలెన్స్ కార్యాలయాలకు సంబంధం లేదంటూ.. విజయవాడ నుంచి తరలిస్తూ హడావుడిగా జీవో ఇవ్వడం సరికాదని సుజనా తప్పుబట్టారు.