పలు అంశాల్లో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల పనితీరు మారడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని గల్లా అన్నారు. స్వేచ్ఛగా పని చేసే స్వభావాన్నిపోలీసులు కోల్పోయారని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు మర్చిపోయారని అన్నారు.
బీసీ నాయకుడు అచ్చెన్నాయుడి పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరుతో పోలీసుల వ్యవహారశైలి మనకు అర్థమవుతుందని చెప్పారు. పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేలోపలే చర్యలు తీసుకోవాలన్నారు. చట్ట విరుద్ధంగా విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆక్సిజన్ లేదంటే.. ఐపీఎల్ అవసరమా…?