చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సన్రైజ్ మాటున చంద్రబాబు బాబు తన సన్ ను రైజింగ్ చేశారని ఆమె దుయ్యబట్టారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ వాదనలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ ఐదేళ్లలో అక్కడ ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని ఆమె తెలిపారు.
అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదని రోజా చెప్పారు. అమరావతిలో రాజధానికి తాము కూడా అప్పట్లో సపోర్ట్ చేశామని తెలిపారు. చంద్రబాబును కేసీఆర్ పొగిడారని టీడీపీ నేతలు అంటున్నారని ఆమె చెప్పారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్ లేడని కేసీఆర్ కూడా అన్నారని రోజా అన్నారు. .