telugu navyamedia
రాజకీయ వార్తలు

మహిళా ఎంపీలకు మోదీ అల్పాహార విందు

PM Modi says India is great

ప్రధాని నరేంద్ర మోదీ మహిళా ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. న్యూఢిల్లీలోని మోదీ అధికారిక నివాసానికి ఎంపీలను ఆహ్వానించి విందు ఇచ్చారు.ఎంపీలు, ప్రభుత్వానికి మధ్య పరస్పర సహకారాన్ని పెంచేందుకే ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీలు, ప్రధాని మోదీ మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఈ మధ్య కాలంలో ఇది ఐదోసారి కావడం విశేషం.

మరో రెండు సమావేశాలు కూడా ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. తొలుత ఓబీసీ ఎంపీలతో, ఆపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఎంపీలతో మోదీ సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆ వరుస క్రమంలోనే నేడు మహిళా ఎంపీలతో మోదీ సమావేశమై పలు అంశాల పై చర్చించారు.

Related posts