ప్రధాని నరేంద్ర మోదీ మహిళా ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. న్యూఢిల్లీలోని మోదీ అధికారిక నివాసానికి ఎంపీలను ఆహ్వానించి విందు ఇచ్చారు.ఎంపీలు, ప్రభుత్వానికి మధ్య పరస్పర సహకారాన్ని పెంచేందుకే ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీలు, ప్రధాని మోదీ మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఈ మధ్య కాలంలో ఇది ఐదోసారి కావడం విశేషం.
మరో రెండు సమావేశాలు కూడా ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. తొలుత ఓబీసీ ఎంపీలతో, ఆపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఎంపీలతో మోదీ సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆ వరుస క్రమంలోనే నేడు మహిళా ఎంపీలతో మోదీ సమావేశమై పలు అంశాల పై చర్చించారు.