ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 2011 లో యూపీఏ ప్రభుత్వంలో శరద్ పవార్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో 24 నవంబర్,2011న ఓ కార్యక్రమానికి హాజరైన శరద్ పవార్ను అర్విందర్ సింగ్(36) అనే వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. అప్పట్లో అర్విందర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టు విచారణ కొనసాగుతుండగానే 2014లో తప్పించుకు పారిపోయాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ను దుర్భాషలాడిన కేసులో సైతం ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఇతడి ఆచూకీ కోసం పలుమార్లు గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాగా అర్విందర్ సింగ్ ఆచూకీపై తాజాగా సమాచారం అందుకున్న పోలీసులు పథకం ప్రకారం అతన్ని అరెస్ట్ చేశారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరుచగా కోర్టు అర్విందర్ సింగ్కు నవంబర్ 25వ తేదీ వరకు జ్యూషియల్ రిమాండ్ విధించింది.
ప్రొసీజర్ ఫాలో అయితే జగన్ ప్రశ్నిస్తున్నారు: యనమల