థాయ్ల్యాండ్ రాజు మహా వజీరలాంగ్కార్న్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజప్రాసాద నిబంధనలను అతిక్రమించిన నలుగురు అధికారులపై వేటు వేశారు. వారిని విధుల నుంచి తొలగించారు. శిక్షపడిన ఉద్యోగులలో ఇద్దరు రాజు శయన మందిరం కాపాలదారులుగా సేవలందించగా మరో ఇద్దరు ఉద్యోగులకు ఇతర బాధ్యతలను గతంలో అప్పగించారు. కాగా.. బెడ్రూమ్ కాపలాదారులు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపై ఆగ్రహించిన రాజు ఆ కాపలాదారులను విధుల నుంచి తొలగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రాచమర్యాదలు, విలువలూ పాటించకుండా.. దిగజారి ప్రవర్తించినందుకు వారిపై చర్యలు తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించినందుకు మరో ఇద్దరు అధికారులనూ థాయ్ రాజు విధుల నుంచి తొలగించారు. కాగా.. రాణికి వ్యతిరేకంగా పథకాలు రచిస్తున్నందుకు ఇటీవలే తన దేవేరికి ఇచ్చిన బిరుదులన్నీ రాజు తొలగించిన విషయం తెలిసిందే.
సీఎం జగన్ హామీలు చేతల్లో చూపించాలి: కన్నా