telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కొల్లు రవీంద్రని పరామర్శించిన టీడీపీ నేతలు

Kollu-Ravindra

ఇటీవల మచిలీపట్నంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన వైసిపి నేత హత్య కేసులో మాజీ మంత్రివర్యులు, కొల్లు రవీంద్రని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి హత్య కేసులో అక్రమంగా ఇరికించడం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. న్యాయస్థానం కొల్లు రవీంద్రకి ఇటీవల బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ జీవి అంజినేయులు, రేపల్లె ఎమ్మెల్యే శ్రీ అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరు సాంబశివరావు పరామర్శించడం జరిగింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు రాజకీయ ఉన్నతిని సహించలేని ప్రభుత్వం ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కేసు నుండి కొల్లు రవీంద్ర కడిగిన ముత్యంలా వస్తారని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts