ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఓటమి పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు చేస్శారు. విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్ కుఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు జనసేన పార్టీ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాడు ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, నేడు జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చిందని తెలిపారు. పద్దెనిమిది సీట్లు సంపాదించిన చిరంజీవి తన దృష్టిలో ‘బాహుబలి’గా అభివర్ణించారు. ‘జనసేన’ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన చిరంజీవి సోదరుడు నాగబాబు గురించి వర్మ వద్ద వేలేకరులు ప్రస్తావించగా, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేశారో కూడా తనకు తెలియదని తెలిపారు.