ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్ 2021 కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో విధ్వంసకర ఓపెనర్లు, ఫినిషర్లు, స్టార్ బౌలర్లు ఉన్నారు. అయితే బౌలింగ్తో పోలిస్తే.. బ్యాటింగ్ కాస్త వెనుకబడే ఉంది. మంచి ఓపెనర్లు, ఫినిషర్లు ఉన్నప్పటికీ మ్యాచ్ సాంతం ఆడుతూ వారికి అండగా నిలిచే ఆటగాళ్లు అవసరం. భారత యువ ఆటగాడు మనీశ్ పాండే.. సన్రైజర్స్ టీంలో ఇదే పాత్రను పోషిస్తున్నాడు. 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్కు దిగుతూ వికెట్లు పడకుండా పరుగులు చేస్తున్నాడు. మనీశ్ పాండే సన్రైజర్స్ టీంలో కీలక ఆటగాడు కాబట్టి.. ఐపీఎల్ 2021లో అతడు ఎలా ఆడాలని కోరుకుంటుందో తాజాగా ఆ జట్టు యాజమాన్యం ఓ ట్వీట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమాలోని ఓ పోస్టర్ను సన్రైజర్స్ ఎడిట్ చేసింది. కత్తి పట్టుకొని పరుగెత్తుతున్న ఎన్టీఆర్ పోస్టర్ను మనీశ్తో ఎడిట్ చేసింది. ఆ పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. ‘మనీశ్ పాండే నుంచి ఏం కోరుకుంటామో మనకు తెలిసిందే. నిర్దాక్షిణ్యంతో కూడిన బ్యాటింగ్’ అని కాప్షన్ పెట్టింది. పాండే అచ్చం ఎన్టీఆర్లానే ఉన్నాడు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. హైదరాబాద్ తన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది.
previous post
next post