వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రికావాలని స్వామిని కోరుకున్నానని సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ అన్నారు. అందుకోసం మొదటిసారిగా తలనీలాలు కూడాస్వామివారికి సమర్పించానని తెలిపారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన ఉదయం సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవ సేవల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని అన్నారు. సంక్షేమ రాజ్యం, బడుగుబలహీన వర్గాల రాజ్యం రావాలని స్వామి ని కోరుకున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పాదయాత్రతో జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఆదరించారని తెలిపారు. టీడీపీ లో ఒకరిద్దరు తప్ప ఏ మంత్రి గెలవరని పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు.
అమితాబ్ తో సమానంగా నటించాను… అయినా… : తాప్సి