telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నటుడు ప్రభుకు కరోనా… రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన నటుడు

Prabhu

ప్రముఖ నటుడు ప్రభుకు కరోనా సోకిందంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఈ విషయంపై ప్రభు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ నటుడు శివాజీ గణేషన్‌ జయంతిని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం గురువారం (అక్టోబర్ ‌1) స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే శివాజీ కుమారుడు, నటుడు ప్రభు మాత్రం ఆ కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని.. అందుకే స్మారక కార్యక్రమానికి హాజరు కాలేదని సోషల్‌మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభు తాను కరోనా బారిన పడలేదని, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. కొద్దిరోజుల క్రితం తన కాలు బెణకడంతో నడవడం కష్టంగా ఉందని, అందువల్లే నాన్నగారి స్మారక కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.

Related posts