యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వరుసగా విడుదలవుతున్న “రాధేశ్యామ్” మోషన్ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23వ తేదీన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ అంటూ మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది యూనిట్. ఈ టీజర్ అందరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 25 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించి అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమా మోషన్ పోస్టర్గా రికార్డ్ను క్రియేట్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
previous post